బాధితులకు న్యాయం లక్ష్యం.. నేరస్థులకు శిక్షే ధ్యేయం: ఎస్పీ.

0
4

అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో కోర్టు కానిస్టేబుళ్లు, కోర్ట్ మానిటరింగ్ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడమే పోలీసుల లక్ష్యమని, నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ప్రతి కేసుపై పూర్తి అవగాహనతో పనిచేసి, సాక్షులను సకాలంలో కోర్టుకు హాజరుపరచాలని, వారెంట్ల అమలులో జాప్యం చేయవద్దని, పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. హత్యలు, మహిళలు, చిన్నారులపై కేసుల్లో ప్రత్యేక దృష్టి పెట్టి నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.