మున్సిపల్ కౌన్సిల్ పదవీకాలం ముగియడంతో మదనపల్లి మున్సిపాలిటీకి జిల్లా జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మను ప్రత్యేక అధికారిగా నియమించారు. మంగళవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధుల పదవీకాలం ముగిసిన నేపథ్యంలో పరిపాలనలో అంతరాయం లేకుండా ప్రత్యేక అధికారుల ద్వారా నిర్వహణ కొనసాగనుంది.
ఈ సందర్భంగా శివ్ నారాయణ శర్మ మాట్లాడుతూ, రోడ్లు, తాగునీరు, పారిశుధ్యం, చెత్త నిర్వహణ, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు.










