మదనపల్లె మండలం చిప్పిలిలో అంగన్వాడీ టీచర్ను బంగారం పేరుతో మోసం చేసిన భార్యాభర్తలపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. సుకన్య, దేవేంద్ర అనే దంపతులు తక్కువ ధరకే బంగారం తెప్పిస్తామని నమ్మించి, అదే గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ రాజేశ్వరి నుంచి సుమారు రూ. 30 లక్షలు తీసుకుని, బంగారం ఇవ్వకుండా మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.










