శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన జనసేన నాయకులు.

0
2

అన్నమయ్య జిల్లా, మదనపల్లెలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని జనసేన పార్టీ నాయకులు, రాయలసీమ రీజనల్ కో-కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి, మదనపల్లె మార్కెట్ కమిటీ చైర్మన్ జంగాల శివరాం రాయల్ ప్రజలకు గురువారం శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముని ఆశీస్సులతో ప్రతి ఇంటా ఆనందం, శాంతి, ఐశ్వర్యం నెలకొనాలని, ధర్మం, న్యాయం, సత్యానికి ప్రతీక అయిన శ్రీరాముని మార్గంలో నడవాలని వారు పిలుపునిచ్చారు. స్థానికంగా శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.