జిల్లా ఆదాయం పెంపే లక్ష్యం.. జీఎస్టీ వసూళ్లపై ప్రత్యేక దృష్టి.

0
1

మదనపల్లి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో, జిల్లా ఖజానా ఆదాయాన్ని పెంచడానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ఎక్సైజ్, కమర్షియల్ టాక్స్, రవాణా, మైనింగ్ వంటి శాఖల పనితీరును ఆయన పరిశీలించారు.

జీఎస్టీ వసూళ్లలో పారదర్శకత పెంచాలని, బిల్లుల ప్రాసెసింగ్ సమయంలో జీఎస్టీ చెల్లింపులను తప్పనిసరి చేయాలని సూచించారు. ప్రత్యేక రెవెన్యూ వింగ్ ద్వారా పర్యవేక్షణ చేపట్టి ఆదాయ లక్ష్యాలను అధిగమించాలని కలెక్టర్ సూచించారు.