శ్రీరామనవమి: మదనపల్లెలో అన్నదానం, పానకం పంపిణీ.

0
0

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం లైఫ్ కేర్ రాజశేఖర్ కుటుంబం ఆధ్వర్యంలో అన్నదాన, పానకం పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. భక్తులకు అన్నప్రసాదం, చల్లని పానకం, మజ్జిగ పంపిణీ చేశారు. ఎండలో భక్తులకు ఈ సేవ ఉపశమనం కలిగించింది. స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీరాముని ఆశీస్సులు పొందారు. రాజశేఖర్ కుటుంబ సభ్యుల సేవాభావాన్ని స్థానికులు ప్రశంసించారు.