అన్నమయ్య జిల్లా ప్రజలు శ్రీరామనవమి పండుగను శాంతియుతంగా, సంతోషంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ ధీరజ్ గురువారం సూచించారు. ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినా తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని, అవాంఛనీయ ఘటనలు నివారించేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని, సమస్యలు ఉంటే వెంటనే 112కు సమాచారం ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. డీజే కార్యక్రమాలు నిర్వహించరాదని, సాంప్రదాయ పద్ధతిలో పండుగ జరుపుకోవాలని సూచించారు.









