రూ.1.6 కోట్లతో రోడ్ల నిర్మాణం

0
2

రోడ్లు నిర్మాణం పూర్తయితే గ్రామాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని, వర్షాకాలంలో మురుగు నీటి సమస్యలు తగ్గుతాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ తెలిపారు.

అలికాం పంచాయతీలో పలు సీసీరోడ్ల పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు రూ. 1. 6 కోట్లలో రోడ్ల పనులు చేపట్టామని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ రూరల్‌ మండలాధ్యక్షుడు ముకాళ్ల శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి కంచు దశరథ, ఎంపీటీసీ నాగేశ్వరరావు, సర్పంచ్‌ రంది అప్పలస్వామి, ఉపసర్పంచ్‌ ఎద్దుమ సుధాకర్‌, జనసేన రూరల్‌ మండలాఽధ్యక్షుడు కుర్మారావు పాల్గొన్నారు.