ఎర్త్ అవర్ కు జిహెచ్ఎంసి పిలుపు.|

0
21

హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత తీసుకోవాలని Greater Hyderabad Municipal corporation పిలుపునిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే Earth hour కార్యక్రమంలో భాగంగా నగర ప్రజలు కూడా చురుకుగా పాల్గొనాలని కోరింది.

ప్రతి సంవత్సరం మార్చి  (28. రాత్రి 8:30 నుండి 9:30  వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా)శనివారం రాత్రి 8:30 నుంచి 9:30 వరకు అవసరం లేని లైట్లు ఆపివేయాలని అధికారులు సూచిస్తున్నారు.

ఈ కార్యక్రమాన్ని World Wide Fund for Nature ప్రారంభించగా, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది పాల్గొంటున్నారు.

జిహెచ్ఎంసి పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, ముఖ్య భవనాలు ఈ ఎర్త్ అవర్ సమయంలో లైట్లు ఆఫ్ చేయడం ద్వారా సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి.

విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా పర్యావరణాన్ని రక్షించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అధికారులు పేర్కొన్నారు.

పర్యావరణ పరిరక్షణ కోసం చిన్నచిన్న చర్యలే పెద్ద మార్పుకు దారి తీస్తాయని, ప్రతి కుటుంబం ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని జిహెచ్ఎంసి కోరింది.

#sidhumaroju

Alwal