చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో శ్రీరామనవమి సందర్భంగా రామలయాల్లో విశేష పూజలు జరిగాయి. దోభి కాలనీలో టీం గణేశా ఆధ్వర్యంలో వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి.
యువకులు, పెద్దలు, పిల్లలు అందరూ పాల్గొని పండుగను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఆలయ పరిసరాలు ‘జై శ్రీరామ్’ నినాదాలతో హోరెత్తాయి.
ఈ కార్యక్రమంలో జనసేన అధ్యక్షుడు నరేష్ రాయల్, టీడీపీ నాయకులు రమేష్ బాబు, నాగరాజ, జగన్నాథం, లిఖిత్ మహేష్, రాజేంద్ర, వినోద్ కుమార్, రెడ్డి మహేష్, చందు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.










