సోమల మండలం, కందూరు గ్రామంలో సీతారాముల కల్యాణోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. వేద పండితుల ఆధ్వర్యంలో సీతారాముల చరిత్రను చెబుతూ కళ్యాణం జరిపించారు.
చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించారు. సాయంత్రం సీతారాముల విగ్రహాల ఊరేగింపు జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అందరూ ‘జై శ్రీరాం’ నినాదాలు చేశారు# కొత్తూరు మురళి.










