గ్రామీణ రోడ్లు, జాతీయ రహదారుల కలయిక ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం మదనపల్లి కలెక్టరేట్లో జరిగిన రహదారి భద్రత కమిటీ సమావేశంలో ప్రమాదాల పరిస్థితిని సమీక్షించారు. జిల్లాలో 18 బ్లాక్స్పాట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
స్పీడ్ బ్రేకర్లు, వీధి దీపాలు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, పోలీస్, ఇంజనీరింగ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఏప్రిల్ 10లోపు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.










