అన్నమయ్య జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను శనివారం ఆదేశించారు. మదనపల్లి కలెక్టరేట్లో జిల్లా ఎస్పీ ధీరజ్ తో కలిసి నిర్వహించిన సమావేశంలో, పాఠశాలలు, కళాశాలల సమీపంలో డ్రగ్స్ విక్రయాలపై కఠిన నిఘా పెట్టాలని.
యువతకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఎస్పీ మాట్లాడుతూ, “ఆపరేషన్ వజ్ర ప్రహార్” ద్వారా డ్రగ్స్ నెట్వర్క్లపై ప్రత్యేక దాడులు కొనసాగుతున్నాయని, డ్రోన్ల సహాయంతో గంజాయి సాగు, అక్రమ కార్యకలాపాలను గుర్తించి అరికడుతున్నామని తెలిపారు.










