భక్తి ఉత్సాహాల మధ్య చౌడేపల్లి వీధుల్లో ఊరేగిన జగదభిరాముడు.

0
0

చౌడేపల్లిలో రాములవారు, సీతమ్మల ఊరేగింపు కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో RGY యువత పెద్ద ఎత్తున పాల్గొని, డప్పులు, మేళతాళాలు, “జై శ్రీరామ్” నినాదాలతో ఊరంతా మారుమోగేలా చేసింది. యువత ముందుండి పల్లకిని తీసుకెళ్తూ భక్తి ఉత్సాహాన్ని ప్రదర్శించింది.

హనుమంతుడి నామస్మరణతో వారి శక్తి మరింత పెరిగింది. గ్రామ ప్రజలతో కలిసి యువత ఐక్యంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసింది# కొత్తూరు మురళి.