లింగ వివక్షత చూపితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆర్డీవో రామ్మోహనరావు ఆదేశించారు. బొబ్బిలి ఆర్డీవో కార్యాలయంలో శనివారం పీసీ అండ్ పి.ఎన్.డి.టి చట్టంపై సమావేశం నిర్వహించారు. ఆడపిల్లల పట్ల వివక్షత చూపినా.
లింగ నిర్ధారణ పరీక్షలు చేసినా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాలికల లింగ నిష్పతి పెంచేందుకు పని చేయాలన్నారు. కార్యక్రమంలో పోలీస్, వైద్య, ఐసీడీఎస్ అధికారులు పాల్గొన్నారు.
#RAJESH









