విద్యాసంస్థలు జీరో వేస్ట్ కేంద్రాలుగా మారాలి: కలెక్టర్.

0
1

మదనపల్లె జిల్లాలోని అన్ని విద్యాసంస్థలు వ్యర్థ రహిత కేంద్రాలుగా మారాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం పుంగనూరు రోడ్డులోని ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజీలో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, తడి, పొడి, ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్ వ్యర్థాలను వేర్వేరుగా నిర్వహించడం తప్పనిసరి అని తెలిపారు.

విద్యాసంస్థలు వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. గ్రామాల్లో స్వచ్ఛ రథాల ద్వారా వ్యర్థాల సేకరణ జరుగుతుందని, ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.