బొబ్బిలి గ్యాస్ ఆఫీసు వద్ద జేబు దొంగల చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ హోమ్ డెలివరీ సక్రమంగా చేయకపోవడంతో ఏజెన్సీకి వస్తున్నారు.
గ్యాస్ కోసం శనివారం క్యూ కట్టడంతో జన సందోహంలో జేబు దొంగలు కలిసిపోయి చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నారు. బొబ్బిలి మండలం పెంటకు చెందిన పి.కృష్ణ జేబులో రూ.8,200 కాజేశారు. సీసీ కెమెరాలు పని చేయకపోవడంతో బాధితుడు నిరాశతో ఇంటికి వెళ్లిపోయారు.
#RAJESH










