రైతుల సమస్యలు పరిష్కరిం చెందుకు చర్యలు తీసుకోవాలి.

0
0

రైతుల సమస్యలు పరిష్కరిం చెందుకు చర్యలు తీసుకోవాలి. ఎమ్మెల్యే సుజనా చౌదరి

.అమరావతి గ్రోత్ ఇంజన్ అవుతుంది.. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి.. …………….*అమరావతి రాజధాని తీర్మానంపై శాసన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి ..*

• అమరావతి సీఎం చంద్రబాబు నాయుడు బ్రెయిన్ చైల్డ్

• కానీ తర్వాత జరిగిన పరిణామాలు వల్ల అమరావతి అభివృద్ధి కుంటుబడింది.

• గత ప్రభుత్వ విధానం వల్ల రాజధాని రైతుల్లో భయం తొలిగించేందుకు ఈ బిల్లును తీసురావడం జరిగింది

• 2014 రాష్ట్ర విభజన బిల్లు ప్రజాస్వామ్య యుతంగాలేదు. అప్పటి పాలకులు పార్లమెంట్ లో ఏపీ కి చెందిన 16 మంది ఎంపీ లను సస్పెండ్ చేసి అన్యాయంగా బిల్లు ను పాస్ చేశారు

• ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత శివరామకృష్ణ కమిటీ నివేదిక ఆధారంగా అమరావతి నీ రాజధానిగా ప్రకటించారు. నాడు శాసనసభ, శాసనమండలి లోని అన్ని పార్టీలు అమరావతి రాజధానిని ఆమోదించారు * అందరూ నాడు సభో ఆమోదించారు. నాడు కేంద్రంలో ఆ శాఖకు ఇంచార్జిగా ఉన్న నేను సర్వే ఆఫ్ ఇండియా ద్వారా అమరావతి నీ ఇండియా మ్యాప్‌ లో పొందుపరచే విధంగా చేసాము..

• 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం దేవాలయంతో సమానమైన శాసన సభలో చేసిన చట్టాన్ని తుంగలో తొక్కి ఇష్టానుసారం గా 3 రాజధానుల బిల్లులు తెచ్చారు..

• పార్లమెంట్ కు తెలియపర్చకుండా 3 రాజధానుల చట్టాన్ని తెచ్చే అధికారం లేకపోయినా నాటి పాలకులు వందల కోట్ల ప్రభుత్వ ధనాన్ని వృధా చేశారు. అప్పట్లో మూడు రాజధానుల పేరుతో తప్పుడు పనులు చేసిన వారిని గుర్తించాలి. ఇప్పటికీ సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులను సైతం ప్రభుత్వం సరిచేయాల్సి ఉంది..

• ప్రభుత్వం రాజధాని రైతుల సమస్యల పరిష్కారము కోసం ఒక టాస్క్ఫోర్స్ కమిటీని నియమించి ప్రత్యేక వెబ్ సైట్ ఏర్పాటు చేసి రైతుల గ్రీవెన్స్ లను నెల నెలా పరిష్కారానికి కృషి చేయాలి..

• అమరావతే శాశ్వత రాజధాని… క్వాంటమ్ కంప్యూటింగ్ హబ్ వంటి సంస్థల ఏర్పాటు ద్వారా రాబోయే కాలంలో వరల్డ్ ఎకానమీ హబ్‌గా అమరావతి మారుతుంది. ° ప్రజలు అమరావతి నీ రాజధానిగా కాకుండా గ్రోత్ ఇంజన్ గా చూడాలి.. అమరావతే శాశ్వత రాజధాని గా ఉండాలి..