యువతను ఏకం చేయడమే లక్ష్యం.. ఎమ్మిగనూరులో రాజీవ్ రెడ్డిని కలిసిన మనీ రెడ్డి.

0
0

ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారిని వైఎస్ఆర్ స్టూడెంట్ స్టేట్ యూనియన్ జనరల్ సెక్రెటరీ మనిరెడ్డి

ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తుతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతున్న తీరు, ప్రభుత్వ విద్యా వ్యవస్థ క్షీణిస్తున్న పరిస్థితులు, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఆలస్యం, హాస్టల్ సదుపాయాల లోపం వంటి సమస్యలపై *మనిరెడ్డి గారు* మరియు *ఎర్రకోట రాజీవ్ రెడ్డి* గారు లోతుగా చర్చించారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు విద్యార్థుల సమస్యలపై బలమైన ప్రజా పోరాటాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించి విద్యార్థుల హక్కులను సాధిస్తామని స్పష్టం చేశారు.

అలాగే నాడు-నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలలు, కాలేజీలలో మౌలిక వసతులు మెరుగుపరచి విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనను గుర్తు చేశారు.

విద్యార్థుల భవిష్యత్తు కాపాడటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని, వారి సంక్షేమం కోసం ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పలువురు యువ నాయకులు, విద్యార్థి సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.