మదనపల్లిలో జరిగిన చిన్నారి హత్య ఘటనపై జిల్లా ఇంచార్జ్ మంత్రి బి. సి. జనార్దన్ రెడ్డి సోమవారం స్పందించారు. స్థానిక నీరుగట్టువారిపల్లిలో జరిగిన ఈ విషాద ఘటన నేపథ్యంలో ఆయన బాధిత కుటుంబాన్ని పరామర్శించి, తల్లిదండ్రులను ఓదార్చారు.
ప్రభుత్వం తరఫున రూ. 10 లక్షల ఆర్థిక సాయాన్ని చెక్ రూపంలో అందజేశారు. అమాయక బాలిక మృతి రాష్ట్రాన్ని కలిచివేసిందని పేర్కొన్న మంత్రి, బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.










