సాకారమైన సొంతింటి కల – మదనపల్లిలో ఘనంగా గృహప్రవేశాలు.

0
0

మదనపల్లి మండలం కోళ్ల బైలు పంచాయతీ హౌసింగ్ లేఅవుట్‌లో సోమవారం గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎమ్మెల్యే షాజహాన్ భాష లబ్ధిదారులకు ఇళ్లలో ప్రవేశం కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా 2,50,893 ఇళ్ల గృహప్రవేశాలు నిర్వహించగా, పేదల సొంతింటి కల నెరవేరిందని కలెక్టర్ తెలిపారు.

పూర్తికాని ఇళ్లకు అదనపు ఆర్థిక సహాయం అందించి పనులు పూర్తి చేయించినట్లు చెప్పారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థికంగా బలోపేతమై సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు సమర్థంగా అమలు చేస్తున్నామని, అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు చేరేలా చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.