అనుచిత పోస్టులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఫిర్యాదు.

0
1

మదనపల్లికి చెందిన కార్ల వ్యాపారి ఖాదరవల్లి, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, స్వాతంత్ర్య సమరయోధుడు వీర సావర్కర్‌పై సోషల్ మీడియాలో అనుచిత చిత్రాలు, వ్యాఖ్యలు పోస్టు చేశారని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు సోమవారం మదనపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

గతంలో ఇలాంటి ఘటనల్లో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఈసారి కఠిన చట్టాల కింద చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకుడు భగవాన్ కోరారు.