పుంగనూరులో స్మార్ట్ మోసం ఆలస్యంగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని ఎమ్మెస్సార్ మూవీ ల్యాండ్ సమీపంలోని ఫర్నిచర్ దుకాణ నిర్వాహకుడికి ఫోన్ చేసి మునిసిపాలిటీ ఫీజు రూ. 2000 చెల్లించాలంటూ స్కానర్ పంపించారు. లేదంటే పెనాల్టీ విధిస్తామని బెదిరించడంతో నిర్వాహకుడు డబ్బులు చెల్లించాడు.
తర్వాత రసీదు కోసం ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ కావడంతో మోసం జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.










