మొయినాబాద్: ఈ ఏరియాల్లో నేడు కరెంట్ బంద్

0
0

హైదరాబాద్- బీజాపూర్ రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా విద్యుత్ స్తంభాల తొలగింపు కారణంగా నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని మొయినాబాద్ ఏఈ హమునాయక్ తెలిపారు. తోల్కట్ట, ఎత్బార్పల్లి, నక్కలపల్లి, కేతిరెడ్డిపల్లి, బ్రౌన్ టౌన్ రిసార్ట్ ప్రాంతాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందన్నారు.

విద్యుత్ వినియోగదారులు దీనిని గమనించి సహకరించాలన్నారు.