నిమ్మనపల్లి లో తాగునీటి కోసం ఘర్షణ – నలుగురికి గాయాలు.

0
1

మంగళవారం నిమ్మనపల్లె మండలంలోని బాలినాయునిపల్లె పంచాయతీ కత్తిరివాండ్లపల్లెలో తాగునీటి వివాదం ఘర్షణకు దారితీసింది. కులాయి వద్ద నీళ్లు తీసుకునేందుకు వెళ్లిన పుష్పావతి (60), లోకేశ్వరి (20)లకు మల్లయ్యతో వాగ్వాదం జరిగింది. మాట మాట పెరిగి ఇరువర్గాలు గొడవపడగా, మల్లయ్య కొడవలితో దాడి చేయడంతో పుష్పావతి, లోకేశ్వరి గాయపడ్డారు. ప్రతిదాడిలో మల్లయ్య, అతని భార్య లక్షుమ్మలు కూడా గాయపడ్డారు. గాయపడిన వారిని మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.