మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఓల్డ్ ఆల్వాల్ పరిధిలోని అయ్యంగారి బస్తీలో నెలకొన్న డ్రైనేజీ సమస్యలను పరిశీలించేందుకు మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు.
సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన డ్రైనేజీ వ్యవస్థ ప్రస్తుతం పూర్తిగా జటిలంగా మారి, స్థానికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందని బస్తీ వాసులు ఆమె దృష్టికి తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా కాలనీవాసులు, ప్రస్తుత పరిస్థితుల్లో పాత పైపుల వల్ల నీరు సరిగా పారకుండా నిల్వలు ఏర్పడుతున్నాయని, దాంతో ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయని వివరించారు. కొత్తగా ఆధునిక డ్రైనేజీ పైపులను వేయాలని వారు విజ్ఞప్తి చేశారు.
వారి సమస్యలను శ్రద్ధగా విన్న శాంతి శ్రీనివాస్ రెడ్డి, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యకు శాశ్వత పరిష్కారం తీసుకురావడానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కాలనీలో మౌలిక వసతుల మెరుగుదల కోసం తన వంతు కృషి కొనసాగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బస్తీ వాసులు చంద్రశేఖర్, నరేందర్ స్వామి, శ్రీకాంత్, నాయకులు లింగారెడ్డి, సాజిద్, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.
#sidhumaroju
Alwal










