ముదిరాజ్ సమన్వయ కమిటీ సన్నాక సమావేశం హైదరాబాదులో ముదిరాజ్ ఆపరేటివ్ సొసైటీ కార్పొరేషన్ లిమిటెడ్ కార్యాలయంలో చైర్మన్ శ్రీ బుర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారి అధ్యక్షతన ముదిరాజ్ సమన్వయ కమిటీ సన్నాహక సమావేశం జరిగినది.ముదిరాజులందరూ ఒకేసారి తీసుకురావాలని సమన్వయ కమిటీ పనిచేయబోతుందని తీర్మానించడం జరిగినది. ఈ సమావేశం క్రింది తీర్మానాలు చేయడం జరిగింది.
ప్రధాన డిమాండ్–BC-D నుండి బీసీలు తీసుకురావడానికి సవాళ్లపై చర్చించడం జరిగినది.- కోకాపేట ముదిరాజ్ భవనాన్ని త్వరలో ముదిరాజ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ట్రస్టు నిర్మాణం చేయాలని తీర్మానం చేయడం జరిగింది. ముదిరాజ్ రాష్ట్ర ముఖ్య సంఘ నాయకులు మేధావులు రిటైర్డ్ ఉద్యోగస్తులు మరియు రాజకీయ నాయకుల కమిటీ నిర్మాణాలను చేయాలని తీర్మానించినది. ముదిరాజు సామాజిక ఆర్థిక రాజకీయ అణిచివేసే ఫోటోలు జరుగుతున్నాయని వీటిని ఇక ముందు ఉపేక్షించేది లేదని చైర్మన్ బుర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు ప్రకటించారు. ఇకముందు గ్రామస్థాయి నుంచి ముదిరాజులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కరించేందుకు ముందుంటామని ఆయన వివరించారు.
అనంతరం హైకోర్టు బార్ కౌన్సిల్ ఉపాధ్యక్షులుగా ఎన్నికైన డి.ఎల్ పాండు ముదిరాజ్ గారిని సన్మానించడం జరిగిందిఈ సమావేశంలో సమన్వయ కమిటీ సభ్యులు డాక్టర్ చొప్పరి శంకర్ ముదిరాజ్, అందే బాబయ్య ముదిరాజ్, ఉప్పరి నారాయణ ముదిరాజ్, మొరే రోహిత్ ముదిరాజ్, గొడుగు శ్రీనివాస్ ముదిరాజ్, డాక్టర్ రెడ్డబోయిన వినోద్ ముదిరాజ్, భీమా లక్మణ్ ముదిరాజ్, రావుల రాజశేఖర్ ముదిరాజ్, ఆగం పాండు ముదిరాజ్, ఇట్లు మోహన్ రాజు ముదిరాజు, P వెంకటేష్ ముదిరాజ్, పుట్టి రాజు ముదిరాజ్, మాల కనకయ్య ముదిరాజ్, నిజ్జని రమేష్ ముదిరాజ్, సుభాషిని ముదిరాజ్, దీపిక ముదిరాజ్, నూతి చలపతి ముదిరాజ్, చింతల్ శ్రీలత ముదిరాజ్, పిట్టల నగేష్ ముదిరాజ్, ఆంజనేయులు ముదిరాజు తదితరులు పాల్గొన్నారు










