హనుమాన్ జయంతి: శాంతి శ్రీనివాస్ రెడ్డి భక్తి దర్శనం.|

0
15

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : హనుమాన్ జయంతి పర్వదినం సందర్భంగా మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి  ఆల్వాల్  ప్రాంతంలోని పలు హనుమాన్ దేవాలయాలను సందర్శించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆమె భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి, సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనాలని ప్రార్థించారు.

ఈ దేవాలయ దర్శన కార్యక్రమంలో యాదగిరి, మహేందర్, సాజిద్, రేణుక, హనుమంత్ తదితరులు పాల్గొని భక్తి వాతావరణంలో పూజలు నిర్వహించారు.

ప్రతి ఆలయంలోనూ భక్తులతో కలిసి హనుమాన్ చాలీసా పారాయణం చేయడం, స్వామివారికి నైవేద్యాలు సమర్పించడం వంటి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.

ఈ సందర్భంగా శాంతి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. హనుమాన్ స్వామి భక్తులకు ధైర్యం, శక్తి, ఆత్మవిశ్వాసం ప్రసాదిస్తారని తెలిపారు. సమాజం మంచి మార్గంలో నడవాలంటే ధర్మం, సేవాభావం అవసరమని పేర్కొన్నారు. ప్రజలందరూ ఐక్యంగా ఉండి సుఖశాంతులతో జీవించాలని కోరుకున్నారు.

హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక అలంకరణలు, పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు.

#Sidhumaroju

Alwal