అన్నమయ్య జిల్లాలో నేరాల నియంత్రణే ప్రధాన లక్ష్యంగా పోలీసులు కట్టుదిట్టంగా పనిచేయాలని జిల్లా ఎస్పీ ధీరజ్ బుధవారం ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన నెలవారీ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, డ్రోన్ కెమెరాలతో నిషేధిత, జనసంచారం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో నిఘా పెంచాలని సూచించారు.
పేకాట, కోడిపందాలు, మద్యపానం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలను అరికట్టాలని, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక దృష్టి సారించి జిల్లాను గంజాయి రహితంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. మహిళల భద్రత విషయంలో రాజీ పడకుండా ‘శక్తి’ బృందాలు చురుకుగా పనిచేయాలని, 112 కాల్స్కు వెంటనే స్పందించాలని ఆదేశించారు.










