సికింద్రాబాద్ : తాడ్బండ్లోని ప్రసిద్ధ హనుమాన్ దేవాలయం హనుమాన్ జయంతి సందర్భంగా ఆధ్యాత్మిక కాంతులతో మెరిసిపోయింది.
దేవాలయ కార్యనిర్వాహణాధికారి నరేందర్ ఆధ్వర్యంలో స్వామివారికి ఉదయం నుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు.
తెల్లవారుజామున నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చి తాడ్బండ్ వీరాంజనేయ స్వామిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. హనుమాన్ చాలీసా పారాయణాలు, ప్రత్యేక పూజలు, అభిషేకాలతో ఆలయం మొత్తం భక్తి పరవశంతో నిండిపోయింది.
ఈ సందర్భంగా పండ్లు, పుష్పాలతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి క్యూలైన్ల ద్వారా దర్శనాన్ని సక్రమంగా నిర్వహిస్తున్నారు.
హనుమాన్ జయంతి సందర్భంగా తాడ్బండ్ ప్రాంతమంతా “జై శ్రీరామ్” నినాదాలతో మార్మోగిపోగా, ఆలయ పరిసరాల్లో రామలక్ష్మణుల సమేత హనుమంతుడి ప్రత్యేక అలంకరణ, రంగురంగుల విద్యుత్ దీపాల కాంతులు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వివిధ థీమ్లతో ఏర్పాటు చేసిన లైటింగ్ సెట్టింగులు ఆలయ ప్రాంగణానికి మరింత శోభను చేకూర్చాయి.
ఈ పవిత్ర సందర్భంగా మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కుటుంబ సమేతంగా ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భక్తి, భవ్యం, వైభవం కలగలిపిన తాడ్బండ్ హనుమాన్ జయంతి వేడుకలు భక్తులను ఆధ్యాత్మిక లోకానికి తీసుకెళ్లాయి.
#sidhumaroju
Alwal










