ఉద్యోగుల ఖాతాల్లోకి పెండింగ్ సొమ్ము – ముఖ్యమంత్రి చంద్రబాబు మానవతా దృక్పథం!
గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన ఉద్యోగుల బకాయిల చెల్లింపుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ఆర్థిక శాఖ అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.
-
భారీ కేటాయింపు: మొత్తం రూ. 7,358 కోట్ల పెండింగ్ బిల్లుల విడుదలకు సీఎం ఆదేశించారు. ఇందులో ప్రావిడెంట్ ఫండ్ (PF) కింద రూ. 1,848 కోట్లు ఇప్పటికే జమ అయ్యాయి.
-
రిటైర్డ్ ఉద్యోగులకు మేలు: గ్రాట్యుటీ బకాయిలు రూ. 3,411 కోట్లు, లీవ్ ఎన్క్యాష్మెంట్ కింద రూ. 1,800 కోట్లు, పోలీస్ అదనపు సరెండర్ లీవుల కోసం రూ. 223 కోట్లు విడుదల కానున్నాయి.
-
చిన్న కాంట్రాక్టర్లకు ఊరట: మెటీరియల్ సరఫరా చేసిన చిన్న కాంట్రాక్టర్లకు రూ. 614 కోట్ల బకాయిలు చెల్లించాలని, వారికి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం సూచించారు.
-
గత ప్రభుత్వంపై విమర్శ: ఉద్యోగుల సొంత సొమ్మును ఇతర అవసరాలకు మళ్లించి వారిని వేధించిన గత ప్రభుత్వ తీరును ఈ సందర్భంగా సీఎం తప్పుబట్టారు. ఇకపై నిధుల లభ్యతను బట్టి ఎప్పటికప్పుడు చెల్లింపులు జరపాలని అధికారులను ఆదేశించారు.










