ఎమ్మిగనూరు మండలం కడిమెట్ల గ్రామంలో సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే అంతర్ రాష్ట్ర గిరిక పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు ప్రారంభించారు.
ఈ వేడుకకు మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర సీఈసీ సభ్యులు ఎర్రకోట జగన్ మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్ మోహన్ రెడ్డి గారి* ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించబడింది. గ్రామీణ వాతావరణంలో ఉత్సాహభరితంగా సాగిన ఈ పోటీలు ప్రజల్లో ఆనందాన్ని నింపాయి.
ఈ సందర్భంగా *రాజీవ్ రెడ్డి* గారు మాట్లాడుతూ, ఇలాంటి సంప్రదాయ పోటీలు పల్లెల్లో రైతులకు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తాయని, గ్రామీణ సంస్కృతిని కాపాడటంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు మండల ఎంపీపీ గొల్ల కేశన్న గారు, కడిమెట్ల సర్పంచ్, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










