పార్లమెంట్లో అమరావతి బిల్లు పై హర్షం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

0
3

పార్లమెంట్ లో అమరావతి బిల్లు ఆమోదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం

• పార్లమెంట్‌లో ఏపీ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు-2026 ఏకగ్రీవంగా ఆమోదం పొందడం చారిత్రాత్మకం.

• ఆంధ్రుల ఆకాంక్ష నెరవేరింది.. అమరావతికి లభించిన ఈ గౌరవం ప్రతీ ఆంధ్రుడికి గర్వకారణం.

• ప్రధాని నరేంద్ర మోదీకి హృదయపూర్వక కృతజ్ఞతలు.. అమరావతి ప్రస్థానంలో ప్రతీ అడుగులో ప్రధాని అండగా నిలిచారు

• 2015లో రాజధానికి శంకుస్థాపన, 2025లో పునర్నిర్మాణం… ప్రధాని మోదీ చేతుల మీదుగానే జరిగింది.

• కేంద్ర ప్రభుత్వం సహా హోంమంత్రి అమిత్ షా పూర్తిగా సహకరించారు.

• పార్లమెంటులో ఈ బల్లుకు సహకరించిన అన్ని రాజకీయ పార్టీలకు ధన్యవాదాలు.

• ఈ విజయం అమరావతి రైతులకు అంకితం.

• రాజధాని కోసం వారు చేసిన త్యాగం, చూపిన పట్టుదల మరువలేనివి.

• అమరావతి ఇక ఆంధ్రులకు ఏకైక ప్రజా రాజధాని.

• రాజధానిపై ఇక ఎలాంటి అనుమానాలకు, చర్చలకు తావులేదు.

• రాష్ట్ర విభజన తర్వాత ఎదుర్కొన్న చీకటి రోజులకు ఇది ముగింపు.

• ఏపీ ప్రగతికి ఈ నిర్ణయం కొత్త నాంది.

• ఏపీకి గుండె, ఆత్మ అయిన అమరావతి ఇక అన్‌స్టాపబుల్.

• దేశానికే అద్వితీయమైన భవిష్యత్ నగరంగా అమరావతి నిలుస్తుంది.

• అమరావతి సుస్థిరతతో నూతన శకం ప్రారంభమైంది.