మదనపల్లెలోని బుగ్గకాల్వ ప్రాంతానికి చెందిన మూడే బాలాజి నాయక్ (32)పై నాటుసారా కేసుల్లో పీడీ యాక్ట్ ప్రయోగించి కడప సెంట్రల్ జైలుకు తరలించారు.
నిందితుడు అక్రమంగా సారా తయారీ, విక్రయాలు చేస్తూ ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాడు. ఇతనిపై ఇప్పటికే ఆరు కేసులు నమోదయ్యాయి. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఎక్సైజ్ అధికారులు ఈ చర్యలు చేపట్టారు. సారా అక్రమాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు.










