రాయల్పాడు వద్ద రోడ్డు ప్రమాదం – యువకుడు మృతి.

0
3

శుక్రవారం ఉదయం మదనపల్లె సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రం రాయల్పాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కడప సబ్ జైలు వీధికి చెందిన దీవన (24) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

ఉద్యోగం కోసం స్నేహితుడు ఉమామహేష్‌తో కలిసి బెంగళూరుకు వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న వాహనానికి సైడ్ ఇవ్వబోయి బైక్ అదుపుతప్పి పడిపోవడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఉమామహేష్‌ను మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.