రాష్ట్ర రహదారులు, భవనాల (R&B) శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈ నెల 5, 6 తేదీల్లో శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
మంత్రిగారి పర్యటన సందర్భంగా జిల్లాకు సంబంధించిన అభివృద్ధి పనులపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. సంబంధిత శాఖల అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.










