చీరాల మండలం బుర్లవారిపాలెం గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి శివ లీల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్లో
బిల్లు ఆమోదం లభించిన శుభ సందర్భంలో గ్రామ సచివాలయం వద్ద దీపాలు వెలిగించి రాజధాని అమరావతికి దీప హారతి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు రాంబాబు.
వెంకటేశ్వర్లు,యువ నాయకులు కొండేపి దుర్గాప్రసాద్,సచివాలయ సిబ్బంది,గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.










