మదనపల్లె జిల్లా ఆసుపత్రిలో తాగునీటి సమస్య తీవ్రతరం కావడంతో అధికారులు శనివారం స్పందించారు. పాత బోర్లో నీటి లభ్యత లేకపోవడంతో వెంటనే రీబోర్ పనులు చేపట్టారు.
ఈ రీబోర్ ద్వారా నీరు లభిస్తే సమస్య పరిష్కారమవుతుందని, లేదంటే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామని ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు. రోగులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.










