మదనపల్లె తహసీల్దార్ కిషోర్ కుమార్ రెడ్డిపై అక్రమ వసూళ్లు, ఆలస్యం ఆరోపణలు రావడంతో కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదివారం ఆయనను బదిలీ చేశారు.
మ్యుటేషన్ కోసం వచ్చిన వ్యక్తుల నుంచి లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఒకరి నుంచి రూ. 5 లక్షలు తీసుకుని కూడా పని చేయలేదని ఆరోపణ.
బాధితులు సీసీఎల్ఏ, కలెక్టర్కు ఫిర్యాదు చేయగా విజిలెన్స్ విచారణలో వాస్తవాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. దీంతో తహసీల్దార్ను బాధ్యతల నుంచి తప్పించారు.










