పుంగనూరు:42వ జాతీయ రహదారిపై ఆటో బోల్తా.. ఒకరికి గాయాలు

0
2

పుంగనూరు పట్టణంలో 42వ జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం చిత్తూరు నుంచి వస్తున్న ఐచర్ వాహనం, MBT రోడ్లో వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో బోల్తా కొట్టి రోడ్డుపై పడింది.

ఆటోలో ప్రయాణిస్తున్న ఒక మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనతో ఆటో నుజ్జునుజ్జయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు# కొత్తూరు మురళి.