రాష్ట్ర అధ్యక్షులుశ్రీ PVN మాధవ్ గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు సూచన మేరకు ఎమ్మిగనూరు అసెంబ్లీ కార్యాలయం నందు *పట్టణ అధ్యక్షులు కోరిశెట్టి జట్టప్ప ఆధ్వర్యంలో* భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్టీ సీనియర్ నాయకులు LV. వెంకటశర్మ గారు, మాజీ OBC మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగ్గపురం చిన్న ఈరన్న, అసెంబ్లీ మాజీ కో కన్వీనర్ తోగట నరసింహులు
పాల్గొని వారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీలో పని చేయడం చాలా అదృష్టం ఎందుకంటే … దేశం ఫస్ట్… పార్టీ నెక్స్ట్… సెల్ఫ్ లాస్ట్… అనే నిదానంతో 2 పార్లమెంట్ స్థానాల నుంచి 300 పార్లమెంట్ స్థానాల వరకు వ్యాప్తి చెంది భారతదేశాన్ని ప్రపంచంలో అగ్ర స్థానంలో నిలబెట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమేనని, అటువంటి పార్టీలో మనందరం ఉన్నందుకు చాలా గర్వపడదాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు రూరల్ మండల అధ్యక్షుడు పార్లపల్లి వెంకటేష్, వ్యాపారవేత్త గణప వీరేష్, పట్టణ మహిళ అధ్యక్షురాలు రాజేశ్వరి, భాగ్యమ్మ పట్టణ ఉపాధ్యక్షులు వెంకటరమణ, నరేంద్ర, రాఘవేంద్ర, విరుపాక్షి, రంగన్న, వెంకటస్వామి వివిధ గ్రామాల నుండి వచ్చిన బిజెపి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.










