పుంగనూరు నుంచి బెంగళూరుకు వెళ్లే జాతీయ రహదారి పనులు నెలలుగా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తవ్విన రోడ్డుపై కంకర వేసి వదిలేయడంతో విపరీతమైన దుమ్ము, ధూళి ఇళ్లలోకి చేరుతోంది.
దీనివల్ల చిన్నారులు, వృద్ధులు శ్వాసకోశ సమస్యలతో అనారోగ్యం పాలవుతున్నారని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డు పనులు పూర్తి చేయాలని, సీఎం చంద్రబాబు నాయుడు, జిల్లా కలెక్టర్ తక్షణ చర్యలు తీసుకోవాలని వారు సోమవారం డిమాండ్ చేశారు# కొత్తూరు మురళి.










