మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఈరోజు మల్కాజిగిరి ఇన్చార్జ్ మైనంపల్లి హనుమంతరావు డివిజన్-190 తుర్కపల్లి పరిధిలోని ముక్తిధామం హిందూ స్మశానవాటికను సందర్శించారు.
జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి రూ.1.90 కోట్ల వ్యయంతో కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పైప్లైన్ పనులు, వాటర్ లైన్ ఏర్పాటు, దహన వేదికలు, ధ్యాన మందిరం, అస్తికల గది, కాంపౌండ్ వాల్ నిర్మాణం, బోర్ సౌకర్యాలు తదితర ముఖ్యమైన మౌలిక సదుపాయాల పనుల పురోగతిని సమీక్షించారు.
పనుల ప్రస్తుత పరిస్థితిపై సమగ్రంగా చర్చించిన ఆయన, బాత్రూమ్ సదుపాయాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, మిగిలిన పనులన్నింటినీ వర్షాకాలం ప్రారంభానికి ముందే పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో అల్వాల్ సర్కిల్ డీసీ భోగేశ్వరులు, డీఈ ప్రశాంతి, ఏఈ రవళి, వర్క్ ఇన్స్పెక్టర్లు, స్మశానవాటిక కమిటీ సభ్యులు జి. ఆనంద్ రెడ్డి, రామ్చందర్ రెడ్డి, లడ్డూ రెడ్డి, శంకర్ యాదవ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
అలాగే కాంగ్రెస్ నాయకులు సురేందర్ రెడ్డి, లక్ష్మీకాంత్ రెడ్డి, శ్రీశైలం యాదవ్, ఆనంద్, రమేష్, సందీప్, దేవ్స్, కొండల్ రెడ్డి, బబ్లు, వెంకటేష్ తదితరులు ఈ పరిశీలనలో పాల్గొన్నారు.
#sidhumaroju
Alwal










