ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా నియమితులైన శ్రీ యూకే వీరేంద్ర గారి సతీమణి శ్రీమతి యూకే సుహాసిని గారు, ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి గారిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా నియామకం పొందడంపై ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారి సహకారం మరియు ఆశీస్సులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆమెకు ఈ బాధ్యతలు రావడం పట్ల ఎమ్మెల్యే గారు అభినందనలు తెలియజేస్తూ, శ్రీ ద్వారకా తిరుమల దేవస్థానం అభివృద్ధి, భక్తులకు మెరుగైన సేవలు అందించే దిశగా సమర్థంగా పనిచేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో టౌన్ కమిటీ సభ్యులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.










