పుంగునూరు నియోజకవర్గ:చౌడేపల్లిలో గంగమ్మ జాతర దీపాల వెలుగుల్లో ఆధ్యాత్మిక శోభ

0
1

చౌడేపల్లి పట్టణంలో గంగమ్మ జాతర ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గ్రామం మొత్తం దీపాలతో అలంకరించి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొల్పారు. అమ్మవారి ఆలయం చుట్టూ భక్తుల రద్దీ పెరిగింది. రాత్రి వేళల్లో దీపాల వెలుగులు గ్రామాన్ని మరింత అందంగా తీర్చిదిద్దాయి. భక్తులు గంగమ్మ తల్లిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

పలువురు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాంప్రదాయ వాద్యాలు, ఊరేగింపులు జాతరలో ఆకట్టుకున్నాయి. యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పోలీసుల భద్రత మధ్య కార్యక్రమాలు ప్రశాంతంగా సాగాయి. జాతర సందర్భంగా చౌడేపల్లి మొత్తం పండుగ వాతావరణంలో మునిగిపోయింది# కొత్తూరు మురళి.