అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలో 30 ఏళ్ల క్రితం దాతలు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి దానం చేసిన మూడు అంగడి గదులను కొందరు వ్యక్తులు రాత్రికి రాత్రి జేసీబీతో కూల్చివేశారు.
ఆలయ కమిటీ ఈ గదుల ఆదాయంతోనే ధూప దీప నైవేద్యాలు నిర్వహించేది. నేలమట్టమైన గదుల వద్దకు చేరుకున్న భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆలయ భూములను కాపాడాలని కోరారు# కొత్తూరు మురళి.










