భీమారం కేజీబీవీని తనిఖీ చేసిన మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్

0
0

భీమారం కేజీబీవీని తనిఖీ చేసిన మంచిర్యాల కలెక్టర్

మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ బుధవారం భీమారం మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. వంటశాల పరిశీలించి, పరిశుభ్రతపై ఆరా తీశారు. తరగతి గదుల్లో విద్యార్థినులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.