మందుబాబుకు 3 రోజుల జైలు శిక్ష
రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బి. రాజేశ్వరరావు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో పట్టుబడిన ముగ్గురిని సెకండ్ అదనపు మేజిస్ట్రేట్ గోదావరిఖని శ్రీ వెంకటేష్ దుర్వ ముందు హాజరుపరచగా, ఇద్దరికి రూ.4000 జరిమానా విధించారు. ఒక వ్యక్తి రెండవసారి పట్టుబడినందున అతనికి 3 రోజుల జైలు శిక్ష విధించారు. అనంతరం అతనిని కరీంనగర్ జిల్లా జైలుకు తరలించారు.
సీఐ గారు మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనం నడపకూడదని, నడిపితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాహనానికి సంబంధించిన పత్రాలు తప్పనిసరిగా వెంట ఉండాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని సూచించారు.అలాగే రాంగ్ రూట్లో ప్రయాణించరాదని, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, అతివేగంగా వాహనాలు నడపకూడదని హెచ్చరించారు.









