మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశాలతో, మేయర్ దర్ని మధుకర్ ఆధ్వర్యంలో “మంచిర్యాల శుభ్రత – ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత” స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. స్థానిక 34వ డివిజన్లో జరిగిన ఈ కార్యక్రమంలో మేయర్ పర్యవేక్షణ చేస్తూ స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
డ్రైనేజీలు, చెత్త క్లీనింగ్ పనులపై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్, పలువురు కార్పొరేటర్లు, మున్సిపల్ మరియు సింగరేణి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నగర పరిశుభ్రతే లక్ష్యంగా ఈ డ్రైవ్ కొనసాగుతోంది.










