జాబ్ ఇస్తామంటూ యువకుడిని మోసం చేసిన సైబర్ గ్యాంగ్.|

0
10

మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా : అల్వాల్ పరిధిలో మరోసారి సైబర్ మోసగాళ్లు రెచ్చిపోయారు. ఆన్‌లైన్ ట్యూషన్ జాబ్ పేరుతో యువకుడిని మోసం చేసి భారీ మొత్తంలో డబ్బు దోచుకున్నారు.

08-04-2026 మధ్యాహ్నం 3:00 గంటలకు హిమాన్షు వినోద్ బిహాని (వయసు 24 సంవత్సరాలు), స్వయం ఉపాధి, భూపతిరావు నగర్, అల్వాల్ నివాసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు ప్రకారం, 06-04-2026 ఉదయం 11:48 గంటల నుండి మధ్యాహ్నం 2:50 గంటల మధ్యలో 7428461371 నంబర్ నుండి కాల్ వచ్చి, ఆన్‌లైన్ ట్యూషన్ జాబ్‌కు ఎంపికయ్యారని నమ్మించారు.

స్మార్ట్ బోర్డ్, ప్రొజెక్టర్, ల్యాప్‌టాప్ పంపిస్తామని చెప్పి ముందుగా ఒక కన్ఫర్మేషన్ అమౌంట్ చెల్లించాలని కోరారు. చెల్లించిన డబ్బును తిరిగి రీఫండ్ చేస్తామని చెప్పడంతో నమ్మిన బాధితుడు మొత్తం రూ.1,07,324/-ను 7 విడతలుగా UPI (QR) ద్వారా పంపించాడు.

తర్వాత ఇది మోసం అని గ్రహించిన బాధితుడు వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు ఫిర్యాదు చేయగా, 33704260014762 అక్‌నాలెడ్జ్‌మెంట్ నంబర్ పొందారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇలాంటి మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ లు హెచ్చరిస్తున్నారు.

#sidhumaroju

Alwal